Sharmila speech at Kottakota - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » Sharmila speech at Kottakota

Sharmila speech at Kottakota

Written By news on Monday, July 1, 2013 | 7/01/2013




ప్రస్తుత ప్రభుత్వానికి రైతులంటే శ్రద్ధ లేదని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల ఆరోపించారు. అలాగే పేద ప్రజలంటే కిరణ్ సర్కార్కు చిన్న చూపని ఆమె అభివర్ణించారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల చేపట్టిన పాదయాత్ర సోమవారం ఉదయం కె.కొత్తకోట చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలపై షర్మిల నిప్పులు చెరిగారు. సక్రమంగా కరెంటు,నీరు అందక రైతులు తీవ్ర వేదన చెందుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు. వేసిన పంట చేతికి రాక రైతు పడుతోన్న వేదన చూస్తే గుండె తరుక్కుపోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వైద్యసేవలు పొందాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకాంక్షించారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయన ప్రారంభించారన్నారు. అయితే రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తుత కిరణ్ ప్రభుత్వం అటక ఎక్కించిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయంలో రైతు సమస్యలపై ఆయన స్పందించిన తీరును షర్మిల ఈ సందర్భంగా ఎండగట్టారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో చెరుకు మద్దతు ధర పెంపుపై పాదయాత్రలో భాగంగా రైతులు తనకు వివరిస్తుంటే సంతోషం కలుగుతోందని షర్మిల తన ప్రసంగంలో వివరించారు.

అంతకు ముందు షర్మిల 'జనం మెచ్చిన జగన్' ఆడియో సీడీని ఆవిష్కరించారు. www.YSFANCLUB.com నుంచి పాటలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Share this article :

0 comments: