వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మాజీ శాసనసభ్యుడు ద్వారకనాథరెడ్డి శనివారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. ద్వారకను వైఎస్ జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ద్వారకనాథరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున 1996లో లక్కిరెడ్డిపల్లె అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తండ్రి రామసుబ్బారెడ్డి కూడా శాసనసభ్యులుగా పనిచేశారు.
2009లో కాంగ్రెస్లో చేరిన ద్వారకనాథరెడ్డి చాలాకాలంగా ఏ పార్టీకీ మద్దతివ్వకండా స్తబ్దుగా ఉన్నారు. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఆయన.. జగన్తోపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.శ్రీకాంత్రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే మోహన్రెడ్డి, జిల్లా క న్వీనర్ కె.సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు.
2009లో కాంగ్రెస్లో చేరిన ద్వారకనాథరెడ్డి చాలాకాలంగా ఏ పార్టీకీ మద్దతివ్వకండా స్తబ్దుగా ఉన్నారు. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఆయన.. జగన్తోపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.శ్రీకాంత్రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే మోహన్రెడ్డి, జిల్లా క న్వీనర్ కె.సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment