పల్లం అగ్ని ప్రమాద బాధితుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నారు. మార్చి 2 తేదిన తూర్పు గోదావరి జిల్లాలోని పల్లంలో జగన్ పర్యటించనున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని తీరప్రాంత మత్స్యకార గ్రామమైన పల్లంలో సోమవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించి కోట్ల రూపాయల ఆస్తి బుగ్గయింది. గ్రామంలో వీరభద్రుని సంబరం సందర్భంగా వేసిన తారాజువ్వ ఓ పూరిపాకపై పడి మంటలు గ్రామాన్ని చుట్టుముట్టాయి. దాంతో 1200 మంది గంగపుత్రుల కుటుంబాలు నిరాశ్రయులైనట్టు అంచనా. సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న గంగపుత్రుల కుటుంబాల్ని జననేత జగన్ పరామర్శించనున్నారు.
Home »
» పల్లం బాధితులను పరామర్శించనున్న జగన్
పల్లం బాధితులను పరామర్శించనున్న జగన్
Written By ysrcongress on Tuesday, February 28, 2012 | 2/28/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment