రేపు తూర్పుగోదావరి జిల్లా పల్లంలో అగ్నిప్రమాద బాధితులకు జగన్‌ పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు తూర్పుగోదావరి జిల్లా పల్లంలో అగ్నిప్రమాద బాధితులకు జగన్‌ పరామర్శ

రేపు తూర్పుగోదావరి జిల్లా పల్లంలో అగ్నిప్రమాద బాధితులకు జగన్‌ పరామర్శ

Written By ysrcongress on Thursday, March 1, 2012 | 3/01/2012

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మార్చి 4న వస్తున్నారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. తొలుత మార్చి 2, 3, 4 తేదీల్లో పర్యటన ఉంటుందని ప్రకటించామని, అయితే తూర్పుగోదావరి జిల్లా పర్యటన కారణంగా ప్రచారాన్ని వాయిదా వేసినట్లు వివరించారు. అంతేకాకుండా 3వ తేదీన ఎన్నిక గుర్తు కేటాయించే అవకాశం ఉన్నందున స్వల్ప మార్పులు చేశామన్నారు. మార్చి 4, 5, 6 తేదీల్లో తొలి విడత పర్యటన ఉంటుందన్నారు. మార్చి 4న విడవలూరు మండలం, 5న కొడవలూరు, 6న ఇందుకూరుపేట, రెండో విడతగా 14న బుచ్చిరెడ్డిపాళెం, 15న కోవూరు మండలంలో జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆయన వివరించారు.

నేటి రాత్రి ఓదార్పునకు విరామం: గురువారం రాత్రి గుంటూరు ఓదార్పుకు విరామమిచ్చి జగన్‌మోహన్‌రెడ్డి రైల్లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు వెళతారు. శుక్రవారం ఉదయం రోడ్డు మార్గాన కాట్రేనికోన మండలం పల్లం చేరుకుని అక్కడ అగ్నిప్రమాద బాధితులను పరామర్శిస్తారు. అదే రోజు రాత్రి బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం 4వ తేదీ కోవూరు చేరుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
Share this article :

0 comments: