రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోవూరు చక్కెర ఫ్యాక్టరీ రైతులకు హామీలు ఇచ్చి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. పార్టీ సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కోఆర్డినేటర్ పి.ఎన్.వి.ప్రసాద్, మరో నాయకుడు శివకుమార్తో కలిసి సోమవారం సచివాలయంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ భన్వర్లాల్కు ఈ మేరకు ఒక ఫిర్యాదును అంద జేశారు. మంత్రి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఉప ఎన్నికల తరువాత కోవూరు చక్కెర ఫ్యాక్టరీ రైతుల బకాయీలను చెల్లిస్తామని నియమావళికి విరుద్ధంగా హామీ ఇచ్చారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆనం హామీకి సంబంధించి ప్రచురితం అయిన పత్రికా క్లిప్పింగ్ను కూడా వారు సీఈఓకు అంద జేశారు.
Home »
» రామనారాయణపై వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు
రామనారాయణపై వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు
Written By news on Monday, February 27, 2012 | 2/27/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment