ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు.. కాంగ్రెస్, టీడీపీ కుట్రపూరిత రాజకీయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల తలపెట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం పునః
ప్రారంభం కానుంది. డిసెంబర్ 14న రంగారెడ్డి జిల్లా బీఎన్ రెడ్డి నగర్లో జరిగిన బహిరంగ సభలో షర్మిల మోకాలికి గాయం కావడంతో.. డిసెంబర్ 15న తుర్కయాంజాల్ సమీపంలో పాదయాత్రకు బ్రేక్ పడింది. మోకాలికి శస్త్రచికిత్స అనంతరం షర్మిల కోలుకోవడంతో బుధవారం ఆమె మళ్లీ పాదయాత్రను మొదలు పెడుతున్నారు. తుర్కయాంజాల్ నుంచి బుధవారం ఉదయం 9.30 గంటలకు యాత్ర పునఃప్రారంభమవుతుందని పాదయాత్ర సమన్వయకర్తలు కేకే మహేందర్రెడ్డి, తలశిల రఘురాం తెలిపారు. తుర్కయాంజాల్, రాగన్నగూడ, మన్నెగూడ క్రాస్రోడ్స్, బొంగ్లూరు, మంగల్పల్లి, శేరిగూడ మీదుగా పాదయాత్ర సాయంత్రం ఇబ్రహీంపట్నం చేరుతుందని, అక్కడ జరిగే బహిరంగసభలో షర్మిల మాట్లాడతారని చెప్పారు.
ప్రారంభం కానుంది. డిసెంబర్ 14న రంగారెడ్డి జిల్లా బీఎన్ రెడ్డి నగర్లో జరిగిన బహిరంగ సభలో షర్మిల మోకాలికి గాయం కావడంతో.. డిసెంబర్ 15న తుర్కయాంజాల్ సమీపంలో పాదయాత్రకు బ్రేక్ పడింది. మోకాలికి శస్త్రచికిత్స అనంతరం షర్మిల కోలుకోవడంతో బుధవారం ఆమె మళ్లీ పాదయాత్రను మొదలు పెడుతున్నారు. తుర్కయాంజాల్ నుంచి బుధవారం ఉదయం 9.30 గంటలకు యాత్ర పునఃప్రారంభమవుతుందని పాదయాత్ర సమన్వయకర్తలు కేకే మహేందర్రెడ్డి, తలశిల రఘురాం తెలిపారు. తుర్కయాంజాల్, రాగన్నగూడ, మన్నెగూడ క్రాస్రోడ్స్, బొంగ్లూరు, మంగల్పల్లి, శేరిగూడ మీదుగా పాదయాత్ర సాయంత్రం ఇబ్రహీంపట్నం చేరుతుందని, అక్కడ జరిగే బహిరంగసభలో షర్మిల మాట్లాడతారని చెప్పారు.
0 comments:
Post a Comment