కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆయన పాదయాత్ర ప్రజల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నా మీకోసం అన్నట్లు ఉందన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన చంద్రబాబు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తారా గానీ, అవిశ్వాస తీర్మానం మాత్రం ప్రవేశపెట్టరన్నారు. చంద్రబాబు పెట్టనని చెబితే, తాము అవిశ్వాస తీర్మానం పెడతామని శ్రీకాంత్ చెప్పారు.
ఆయన పాదయాత్ర ప్రజల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నా మీకోసం అన్నట్లు ఉందన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన చంద్రబాబు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తారా గానీ, అవిశ్వాస తీర్మానం మాత్రం ప్రవేశపెట్టరన్నారు. చంద్రబాబు పెట్టనని చెబితే, తాము అవిశ్వాస తీర్మానం పెడతామని శ్రీకాంత్ చెప్పారు.
0 comments:
Post a Comment