వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి నడిచినట్లే ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డితో కలిసి నడుస్తానని సినీనటుడు శ్రీహరి తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ జగన్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తన మద్దతు ఉంటుందన్నారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు శ్రీహరి తెలిపారు.
రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించే సత్తా ఒక్క జగన్ కే ఉందన్నారు. కుమ్మక్కు రాజకీయాలు తెలియని ఒకే ఒక్క నాయకుడు జగన్ అని శ్రీహరి పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు
రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించే సత్తా ఒక్క జగన్ కే ఉందన్నారు. కుమ్మక్కు రాజకీయాలు తెలియని ఒకే ఒక్క నాయకుడు జగన్ అని శ్రీహరి పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు
0 comments:
Post a Comment