వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల కాలు ఆపరేషన్పై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఒంగోలు, రాజంపేట ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి శుక్రవారం తమ తమ ప్రాంతాల్లో విలేకరులతో మాట్లాడుతూ... ముద్దుకృష్ణమనాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల పాదయాత్రకు రోజురోజుకు పెరుగుతున్న జనాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ మేకపాటి నెల్లూరులో విమర్శించారు. షర్మిల కాలికి దెబ్బతగలలేదని టీడీపీ, బీజేపీ నాయకులు మాట్లాడడం నీచాతినీచమన్నారు. దెబ్బతగలకపోతే యాత్ర ఆపాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే కోస్తా ప్రాంతంలో యాత్ర జరుగుతుండేదన్నారు. కాలిదెబ్బకు డాక్టర్లు ఆపరేషన్ చేసిన అనంతరం ఆరు వారాలు విశ్రాంతి కావాలని చెప్పారన్నారు. తాజాగా వైద్యులు పరీక్షించిన అనంతరం పాదయాత్ర చేసుకోవచ్చని తెలిపారన్నారు. ఇవన్నీ అబద్ధమని కొందరు నాయకులు దిగజారి మాట్లాడడం దారుణమన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో విలేకరులతో మాట్లాడుతూ.. షర్మిల కాలి ఆపరేషన్ గురించి గాలి మాటలు కట్టిపెట్టాలని ముద్దుకృష్ణమనాయుడును హెచ్చరించారు. ‘షర్మిల కాలికి ఆపరేషన్ జరగలేదంటే నా కాలు తీయించుకుంటా, జరిగితే నీ కాలు తీయించుకుంటావా’ అని ప్రశ్నించారు. షర్మిల పాదయాత్రపై చౌకబారు విమర్శలు మానుకోవాలని ముద్దుకృష్ణమనాయుడుకు ఆకేపాటి రాజంపేటలో సూచించారు. నోటి దురుసు మాటలు కట్టిపెట్టాలని హెచ్చరించారు.
Home »
» ఆపరేషన్ నిజమైతే ..నీ కాలు తీయించుకుంటావా?
ఆపరేషన్ నిజమైతే ..నీ కాలు తీయించుకుంటావా?
Written By news on Saturday, February 9, 2013 | 2/09/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment