ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే కోవూరు ఉప ఎన్నికల్లో గెలవాలని ప్రభుత్వానికి బాలినేని సవాల్ విసిరారు. ఈ ఉప ఎన్నికలు ప్రభుత్వానికి రిఫరెండమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని బాలినేని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ సభ్యుడు జూపూడి , జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరగబోయే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తోందని జూపూడి అన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ సభ్యుడు జూపూడి , జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరగబోయే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తోందని జూపూడి అన్నారు.
జగన్ను అడ్డుకోవడం ఎవరితరం కాదు: సబ్బం
రాష్ట్రంలో ఎన్నికలంటూ వస్తే వైఎస్ జగన్ అధికారంలోకి రావడాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పాలకవర్గ పదవీ కాలం ముగియడంతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది కార్పోరేటర్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా సబ్బం హరి పాల్గొన్నారు. మహానేత వైఎస్ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక.. ప్రాణాలు విడిచిన వారికి ఆర్ధిక సాయం చేస్తామన్న ఏఐసీసీ ఇంత వరకు మాట నిలబెట్టుకోలేదని సబ్బం హరి అన్నారు.
అచ్చమ్మ కుటుంబానికి జగన్ ఓదార్పు
జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా కొత్తత్రిపురాపురానికి చెందిన అచ్చమ్మ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక అచ్చమ్మ పాణాలు వదిలారు. అచ్చమ్మ మరణానికి ముందే భర్త, కొడుకు మరణించారు. కోడలు, మనవలు, మనవరాళ్లతో కలిసి కాలం నెట్టుకు వస్తున్న అచ్చమ్మ కూడా చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలో పడింది. ఇబ్బందులకు గురైంది. ఇబ్బందుల్లో ఉన్న అచ్చమ్మ కుటుంబాన్ని జగన్మోహన్రెడ్డి ఓదార్చారు. వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబాన్ని ఆదుకుంటానని మాటిచ్చారు. కష్టంలోనూ.. సుఖంలోనూ కలిసి నడుద్దామని.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెంట ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు.
ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఆదరణ: ధర్మాన
ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మీడియాకు వెల్లడించారు. రాష్ర్టంలో ఏ మూలకు వెళ్లినా.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని ఆయన అన్నారు. గడప గడపకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని ఆయన నరసన్నపేటలో ప్రారంభించారు. గడప గడపకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పోస్టర్ను ఆయన విడుదల చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే కార్యక్రమాల్ని అందులో వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియతోపాటు జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment