నర్సరామయ్యను పరామర్శించిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నర్సరామయ్యను పరామర్శించిన జగన్

నర్సరామయ్యను పరామర్శించిన జగన్

Written By news on Friday, May 4, 2012 | 5/04/2012


ఎమ్మెల్సీ బత్తల చెంగలరాయుడు అనుచరుల దాడిలో గాయపడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నర్సరామయ్యను వైఎస్‌ జగన్ పరామర్శించారు. ఎమ్మెల్సీ అనుచరులు నర్సరామయ్యపై హత్యాయత్నానికి పాల్పడ్డడాన్ని ఖండించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు మద్దతు పలకవద్దంటూ ఎమ్మెల్సీ అనుచరులు గత కొంతకాలంగా నర్సరామయ్యను బెదిరిస్తున్నారు.

తాను జగన్‌ వెంటే ఉంటానని నర్సరామయ్య స్పష్టం చేయడంతో ఎమ్మెల్సీ అనుచరులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని రాజంపేట ఆసుపత్రిలో చేర్చారు. నర్సరామయ్యను పరామర్శించిన జగన్‌ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఇలాంటి దాడులకు భయపడవద్దని ధైర్యం చెప్పారు.

Share this article :

0 comments: