సోనియా గాంధీ ప్రమోషన్ ఇచ్చిందంటూ తిరుపతి ప్రజలను చిరంజీవి గాలికొదిలేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. తిరుపతిలో అష్టకష్టాలు పడుతున్న జనాన్ని ఏమాత్రం పట్టించుకోని చిరంజీవి.... తిరుపతిని కాదని హైదరాబాద్లో ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఉండేందుకు అంగీకరించారని జగన్ నిప్పులు చెరిగారు.
మండు వేసవిలో తాగేందుకు మంచినీళ్లు దొరక్క అల్లాడుతున్న అక్కచెల్లెళ్ల కోసం చిరంజీవి పదవీ త్యాగం చేసి ఉంటే.. తాను సెల్యూట్ చేసి ఉండేవాడినని జగన్ అన్నారు. తిరుపతి ఆటో నగర్ నుంచి జగన్ రెండో రోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలో జరగబోయే మార్పులకు ఉప ఎన్నికలు నాంది పలకాలని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో పేదవాడు, రైతుల దుస్థితికి ఈ ఎన్నికలు అద్దం పట్టాలన్నారు. ఉప ఎన్నికల తీర్పు పాలకులకు కనువిప్పు కావాలన్నారు వైఎస్ జగన్. ఢిల్లీ రిమోట్ పాలనకు తగిన గుణపాఠం నేర్పాలని కోరారు. తిరుపతిలోని లక్ష్మీపురంలో ఎన్నికల ప్రచారం సాగించిన జగన్కు జనం అపూర్వ స్వాగతం పలికారు.
మండు వేసవిలో తాగేందుకు మంచినీళ్లు దొరక్క అల్లాడుతున్న అక్కచెల్లెళ్ల కోసం చిరంజీవి పదవీ త్యాగం చేసి ఉంటే.. తాను సెల్యూట్ చేసి ఉండేవాడినని జగన్ అన్నారు. తిరుపతి ఆటో నగర్ నుంచి జగన్ రెండో రోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలో జరగబోయే మార్పులకు ఉప ఎన్నికలు నాంది పలకాలని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో పేదవాడు, రైతుల దుస్థితికి ఈ ఎన్నికలు అద్దం పట్టాలన్నారు. ఉప ఎన్నికల తీర్పు పాలకులకు కనువిప్పు కావాలన్నారు వైఎస్ జగన్. ఢిల్లీ రిమోట్ పాలనకు తగిన గుణపాఠం నేర్పాలని కోరారు. తిరుపతిలోని లక్ష్మీపురంలో ఎన్నికల ప్రచారం సాగించిన జగన్కు జనం అపూర్వ స్వాగతం పలికారు.
0 comments:
Post a Comment