కరుణన్న విజయాన్ని జగనన్నకు కానుకగా ఇస్తాం : మిథున్‌రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కరుణన్న విజయాన్ని జగనన్నకు కానుకగా ఇస్తాం : మిథున్‌రెడ్డి

కరుణన్న విజయాన్ని జగనన్నకు కానుకగా ఇస్తాం : మిథున్‌రెడ్డి

Written By news on Wednesday, May 2, 2012 | 5/02/2012

ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించి జగనన్నకు కానుకగా అందిస్తామని పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తిరుపతిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన రోడ్‌షోలో పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి పాల్గొన్నారు. రైల్వే కాలనీలో జరిగిన జనసభలో ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి మనస్తత్వం తనకు బాగా తెలుసునని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, అందరినీ నమ్మడం ఆయన నైజమని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే ఆయన ఓదార్పు యాత్ర చేస్తున్నారని చెప్పారు. యువనాయకుడిపై పాలక, ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు దుష్ర్పచారం సాగిస్తున్నాయని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.
Share this article :

0 comments: