హైదరాబాద్, న్యూస్లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంట్ సభ్యులు జగన్మోహన్రెడ్డికి పటిష్ట భద్రత కల్పించాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బాజిరెడ్డి గోవర్ధన్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) వి.దినేష్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో బుధవారం వినతిపత్రం అందజేశారు. జెడ్ క్యాటగిరీ భద్రత కలిగిన జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార పర్యటనలకు సంబంధించిన అన్ని వివరాలనూ జిల్లా పోలీసులకు ముందుగానే తెలియజేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివరించారు.
తిరుపతి పర్యటన సందర్భంగా జనం తొక్కిసలాటలో జగన్మోహన్రెడ్డి చిక్కుకున్న సందర్భంలో పోలీసు సిబ్బంది వాహనాలలో నుంచి కనీసం కిందికి దిగలేదని ఆరోపించారు. జగన్ భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ ఎస్ఏ హుడా సానుకూలంగా స్పందించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. బాజిరెడ్డి గోవర్ధన్తోపాటు కె.శివకుమార్, పి.ప్రతాప్రెడ్డి, ఆదం విజయ్, మొహ్మద్ తదితరులు డీజీపీని కలిసిన వారిలో ఉన్నారు.
జగన్ భద్రత కుదింపుపై విచారణ జరిపించాలి: ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు
జగన్మోహన్ రెడ్డికి జెడ్ క్యాటగిరీ ఉన్నా భద్రతను కుదించడంపై విచారణ జరిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టు న్యాయవాది పి. సాయికృష్ణ అజాద్ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్ హెచ్ఆర్సీ)కి బుధవారం ఫిర్యాదుచేశారు. గతంలో తాను ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుశాఖ తగిన విధంగా భద్రతా చర్యలు తీసుకోలేదని తాజాగా వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. జగన్ భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని ఆ ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.
0 comments:
Post a Comment