వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ పార్టీ శాడిస్ట్లా వ్యవహరిస్తోందని సినీ నటి రోజా మండిపడ్డారు. జెడ్ కేటగిరిలో ఉన్న జగన్కు కనీస భద్రత కల్పించడంలేదని ఆమె ఆరోపించారు. చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు ఎస్పీ అధికారపార్టీ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. జగన్ సభలలో, రోడ్ షోలలో తొక్కిసలాట, ప్రమాదాలు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా 18 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్వేనని రోజా ధీమా వ్యక్తం చేశారు.
Home »
» ప్రభుత్వం శాడిస్టులా వ్యవహరిస్తోంది: రోజా
ప్రభుత్వం శాడిస్టులా వ్యవహరిస్తోంది: రోజా
Written By news on Tuesday, May 1, 2012 | 5/01/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment