అది ‘నారా’ ఎద్దు వదిలేయండి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అది ‘నారా’ ఎద్దు వదిలేయండి!

అది ‘నారా’ ఎద్దు వదిలేయండి!

Written By news on Wednesday, May 2, 2012 | 5/02/2012

 జనంలోకి దూసుకొచ్చిన ఓ ఎద్దును చూసి భయపడి దూరంగా పారిపోతున్న ప్రజలను ఉద్దేశించి ‘‘అది నారా వారి ఎద్దు లేండి బాగా బలిసింది వదిలేయండి’’ అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చమత్కరించారు. ఉప ఎన్నికల ప్రచారంలో తిరుపతికి వచ్చిన జగన్ రాత్రి 7.30 గంటలకు జ్యోతి థియేటర్ సర్కిల్లో రోడ్‌షో నిర్వహించారు. జగన్ కంటే పది నిమిషాల ముందు అక్కడికి చేరుకున్న అంబటి రాంబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా ఓ ఎద్దు జనంలోకి దూరింది. 

చుట్టూ జనం ఉండటంతో ఎటు పోవాలో తెలియక బిత్తరగా ఎద్దు వస్తుండటంతో జనం భయంతో పక్కకు పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ తతంగాన్ని చూసిన అంబటి తనదైన శైలిలో చమత్కరించారు. ‘‘అమ్మా మీరు భయపడకండి 9 ఏళ్లు అధికారంలో ఉండి అవినీతితో సంపాదించిన సొమ్ము తిని నారాచంద్రబాబునాయుడు ఆ ఎద్దులా బాగా బలిసి మన పార్టీపై ఆరోపణలు చేస్తూ ఏమీ చేయలేక పోతున్నాడు. అదేవిధంగా ఈ ఎద్దు కూడా జనం మధ్యకు వచ్చి సభకు అంతరాయం కలిగించాలని చూస్తోంది. దానిని ఏమి అనకండి విడిచిపెట్టండి దానంతట అదే వెళ్లిపోతుంది.’’ అంటూ చెప్పడంతో జనం చప్పట్లతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

జగన్ ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు పదేపదే బంతిపూలను జగన్‌పై చల్లడంతో కుడి కంటికి తగిలింది. దీంతో బాధ భరిస్తూనే అభిమానులకు అభివాదం చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. జ్యోతి థియేటర్ వద్ద స్థానిక నాయకులు దుద్దేలబాబు, బొమ్మగుంట రవి, జయరాంయాదవ్, యాదవ్‌కృష్ణ, గోపీయాదవ్, బండి కుమార్, పుష్పలత, సుబ్బులమ్మ, కనకమ్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Share this article :

0 comments: