ఒంగోలు నియోజకవర్గంలో జగన్ ప్రచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒంగోలు నియోజకవర్గంలో జగన్ ప్రచారం

ఒంగోలు నియోజకవర్గంలో జగన్ ప్రచారం

Written By news on Saturday, May 19, 2012 | 5/19/2012


వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి ఒంగోలు ప్రజలు నీరాజనాలు పలికారు. ఆయన శనివారం ఉదయం వైవీ భద్రారెడ్డి నివాసం నుంచి ఉప ఎన్నికల ప్రచారానికి బయల్దేరారు. రాజన్న బిడ్డను చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ పలకిస్తూ జగన్‌ ముందు కదిలారు.

ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కొత్తపట్నం మండలం ఈతముక్కల, మడనూరు గ్రామాల్లో జరిగే ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.


అనంతరం ఒంగోలు మండలం పరిధిలోని చెరువు కొమ్ముపాలెం, యరజర్ల, సర్వేరెడ్డిపాలెం, వెంగముక్కపాలెంలో పర్యటిస్తారు. ఆ తర్వాత ఒంగోలు నగరంలోని చర్చి సెంటర్‌లో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో జగన్ ప్రసంగిస్తారు. అక్కడ నుంచి పాత మార్కెట్ సెంటర్‌లో జరిగే రోడ్‌షోలో మాట్లాడతారు. తదనంతరం కర్నూలు రోడ్డులోని సెయింట్ జేవియర్స్ సమీపంలోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత గాంధీనగర్‌లోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.

Share this article :

0 comments: