కర్నూలు(విద్య), న్యూస్లైన్: విద్యార్థుల జీవితాలతో ఇంటర్మీడియెట్ బోర్డు చెలగాటమాడుతోంది. ఆన్లైన్ దరఖాస్తులో జరిగిన తప్పులకు వారినిబలిపశువులను చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా 20వేల మందికి హాల్టికెట్లు ఇవ్వకుండా నిరాకరించగా.. జిల్లాలో 300 మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. ఈ విషయంలో జిల్లా అధికారులుహైకోర్టు ఉత్వర్వులను సైతం భేఖాతరు చేయడం గమనార్హం. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు వైఎస్ఆర్ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రాకేష్ రెడ్డి ,విద్యార్థిసంఘాల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడంతో పాటు ఆర్ఐవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఒకానొక సమయంలో సహనం కోల్పోయిఆర్ఐఓ కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఆర్ఐఓ ప్రసాద్ కంటతడి పెట్టారు. ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచిప్రారంభమయ్యాయి. అయితే 300 మందికి పైగా విద్యార్థులకు హాల్టికెట్లు అందలేదు. ఆన్లైన్లో కాకుండా మాన్యువల్ పద్ధతిన పరీక్ష ఫీజు చెల్లించడంతో బోర్డుఅనుమతించలేదు.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తి మరికొందరికి హాల్టికెట్లు చేరలేదు. ఇందుకు తామేమీ చేయలేమని బోర్డు అధికారులు హాల్టికెట్లుఇచ్చేందుకు నిరాకరించారు. రెండు రోజులుగా హైదరాబాద్లోని బోర్డు కార్యాలయం వద్ద జిల్లాలోని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పడిగాపులుకాసినా ఫలితం లేకపోయింది. బుధవారం ఉదయానికి ఆయా కళాశాలలకు హాల్టికెట్లు వస్తాయని అందరూ భావించారు.
కానీ అటు కళాశాలలకు గానీ, ఇటు ఆర్ఐవో కార్యాలయానికి గానీ, ఆన్లైన్లో సైతం హాల్టికెట్లు కనిపించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం 7గంటలకే ఆర్ఐవో కార్యాలయం చేరుకుని ముట్టడించారు.
వీరికి వైఎస్ఆర్ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రాకేష్ రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్యనాయకులు మద్దతు తెలిపారు. పరిస్థితిని ఆర్ఐవో ఎన్.ప్రసాద్ జిల్లా కలెక్టర్ రాంశంకర్నాయక్కు ఫోన్లో వివరించారు. ఆయన బోర్డు కార్యదర్శి సుబ్రహ్మణ్యంతో మాట్లాడినాఫలితం లేకపోయింది. ఉదయం 8 గంటలు దాటిపోవడంతో విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది.
వీరికి వైఎస్ఆర్ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రాకేష్ రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్యనాయకులు మద్దతు తెలిపారు. పరిస్థితిని ఆర్ఐవో ఎన్.ప్రసాద్ జిల్లా కలెక్టర్ రాంశంకర్నాయక్కు ఫోన్లో వివరించారు. ఆయన బోర్డు కార్యదర్శి సుబ్రహ్మణ్యంతో మాట్లాడినాఫలితం లేకపోయింది. ఉదయం 8 గంటలు దాటిపోవడంతో విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది.
అరగంట అనుమతి తీసుకునైనా పరీక్ష రాయాలన్న ఉద్దేశంతో వారంతా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం చేరుకున్నారు. విద్యార్థుల సమస్యలను వివరించేందుకు వెళ్లినఆర్ఐవోను జిల్లా కలెక్టర్ మందలించారు. ఇక్కడికి ఎవరు రమ్మన్నారు... గెటౌట్ అంటూ మండిపడ్డారు. దీంతో ఆర్ఐవో మనస్థాపం చెంది బయటకు వచ్చారు. సమయందాటిపోతుండటంతో విద్యార్థులు వైఎస్ఆర్ విద్యా ర్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షు లు రాకేష్ రెడ్డి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వైఎస్ఆర్ విద్యార్థి ఫెడరేషన్గంటకు పైగా ఆందోళన చేసినా ఫలితం లేకపోయింది. ఈ దశలో సీఐ రంగనాయకులు విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడి అక్కడి నుంచి కలెక్టరేట్ గేటు వద్దకుపంపించారు.
విద్యార్థి సంఘాల మద్దతు: కలెక్టరేట్ గేటు వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వైఎస్ఆర్ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రాకేష్ రెడ్డి , బీసీ, ఎస్సీ,ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జె.లక్ష్మీనరసింహ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సి.పి.నాయుడు తదితరులు మద్దతు తెలిపారు. వారితో పాటు మధ్యాహ్నంవరకు ఆందోళన నిర్వహించారు. ఈ సమయంలోనే హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడంతో ఆ కాపీని తీసుకుని జిల్లా కలెక్టర్కు చూపించేందుకు వెళ్లారు. ఆయన ఎంతకూబయటకు రాకపోవడంతో ఆర్ఐవో కార్యాలయానికి చేరుకున్నారు.
ఆర్ఐవో కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం: హైకోర్టు స్టే కాపీని ఆర్ఐవోకు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు చూపించారు. దీని ఆధారంగా విద్యార్థులను పరీక్షకుఅనుమతివ్వాలని కోరారు. బోర్డు కార్యదర్శి నుంచి ఆదేశాలు వచ్చే వరకు తానేమీ చేయలేనని, ఈ సమస్య రాష్ట్రమంతటా ఉందని ఆర్ఐవో చెప్పబోయారు.
హైకోర్టు స్పష్టంగా ఉత్తర్వులిచ్చినా జిల్లా అధికారులు స్పందించకపోవడంపై విద్యార్థులు, సంఘాల నాయకులు మండిపడ్డారు. ఆవేదన, ఆగ్రహంతో ఆర్ఐవో కార్యాలయంలోనిఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కిటికీ అద్దాలు, ఫోన్ను పగులగొట్టారు. అడ్డొచ్చిన ఆర్ఐవోను తోసేశారు. ఒక దశలో ఆయన కంటతడి పెట్టుకున్నారు. కొద్దిసేపటికి రెండో పట్టణసీఐ మురళీధర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఆర్ఐఓపై కలెక్టర్ ఆగ్రహం
కర్నూలు(కలెక్టరేట్): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి పలువురు విద్యార్థులు హాల్టికెట్లు అందక ఇబ్బందులు ఎదుర్కోవడంపై జిల్లా కలెక్టర్ రాంశంకర్నాయక్ స్పందించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాలని ఆర్ఐఓ ప్రసాద్ను ఆదేశించారు.
కొందరు విద్యార్థులకు హాల్ టికెట్లు అందని విషయాన్ని ఈనెల 14న పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని,కనీసం పరీక్షలకు ముందు రోజైనా(16న) ఎందుకు చెప్పలేదని ఆర్ఐఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాల్ టికెట్లు అందకపోవడంపై అనేకమంది విద్యార్థులు కలెక్టర్ క్యాంపుకార్యాలయానికి తరలివచ్చారు. దీనిపై కలెక్టర్ ఆర్ఐఓను పిలిపించుకుని మాట్లాడారు. ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
హాల్ టికెట్ లేకపోయినా పరీక్షకు అనుమతి:
పరీక్ష ఫీజు చెల్లించినా హాల్టికెట్ అందని విద్యార్థులకు ఊరట కలిగించేలా ఇంటర్మీడియెట్ బోర్డు బుధవారం సాయంత్రం నిర్ణయం ప్రకటించింది. అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రథమ,ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు ఫీజులు చె ల్లించి, ఆన్లైన్లో కన్ఫం చేసినా, చేయకున్నా గురువారం నుంచి రాసే పరీక్షలకు అనుమతిస్తున్నట్లు ఆర్ఐవో ఎన్.ప్రసాద్తెలిపారు. హాల్టికెట్లను ఆర్ఐవో కార్యాలయానికి పంపుతున్నారని.. వీటిని ఆయా కళాశాలలు, పరీక్ష కేంద్రాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పరీక్షకేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, కళాశాలల ప్రిన్సిపాళ్లు వారి సిబ్బందిని హాల్టికెట్లకై తమ కార్యాలయానికి పంపి తీసుకెళ్లాలని సూచించారు.
0 comments:
Post a Comment