సాక్షి మీడియా అకౌంట్స్ ఫ్రీజ్ను నిరసిస్తూ శనివారం సాయంత్రం ట్యాంక్బండ్పై జర్నలిస్టులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల యూనియన్ సంయుక్త అధ్వర్యంలో ట్యాంక్బండ్పై గల స్వామి వివేకానంద విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ప్రదర్శన చేపట్టారు. 'సాక్షి'కి మద్దతుగా పెద్ద ఎత్తున జర్నలిస్టులు, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీల నాయకులు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. 'సాక్షి'పై ప్రభుత్వ దమనకాండను ముక్త కంఠంతో ఖండించారు.
న్యూఢిల్లీ: 'సాక్షి' మీడియాకు నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(ఇండియా) బాసటగా నిలిచింది. హరిద్వార్లో ప్రారంభమైన 2 రోజుల ఎన్ యూజే(ఐ) జాతీయ కార్యవర్గ సమావేశంలో సాక్షిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అణచివేత ధోరణిని ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎన్ యూజే(ఐ) పశ్చిమబెంగాల్ శాఖ ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని ఒడిశా విభాగం బలపరిచింది. సాక్షిపై జరుగుతున్న దాడులపై జాతీయ కార్యవర్గం చర్చించింది. సాక్షి మీడియాపై జరుగుతున్న దాడులతో జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాక్షిపై వేధింపులు మానాలని ఎన్ యూజే(ఐ) హితవు పలికింది.
న్యూఢిల్లీ: 'సాక్షి' మీడియాకు నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(ఇండియా) బాసటగా నిలిచింది. హరిద్వార్లో ప్రారంభమైన 2 రోజుల ఎన్ యూజే(ఐ) జాతీయ కార్యవర్గ సమావేశంలో సాక్షిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అణచివేత ధోరణిని ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎన్ యూజే(ఐ) పశ్చిమబెంగాల్ శాఖ ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని ఒడిశా విభాగం బలపరిచింది. సాక్షిపై జరుగుతున్న దాడులపై జాతీయ కార్యవర్గం చర్చించింది. సాక్షి మీడియాపై జరుగుతున్న దాడులతో జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాక్షిపై వేధింపులు మానాలని ఎన్ యూజే(ఐ) హితవు పలికింది.
0 comments:
Post a Comment