అనంతపురం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాయదుర్గం పర్యటన పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార సభలకు జనం రాకపోవడంతో సీఎం ఇష్టమొచ్చినట్లు ప్రసంగించారని ఆయన విమర్శించారు. అభివృద్ధి సంగతి మరిచి తనను, జగన్ను విమర్శించడానికే ముఖ్యమంత్రి పరిమితమయ్యారని పేర్కొన్నారు. మంత్రి రఘువీరా రెడ్డి కులాలను రెచ్చగొట్టేవిధంగా ప్రవర్తిస్తున్నారని రామచంద్రారెడ్డి ఆరోపించారు.
Home »
» 'సీఎం రాయదుర్గం పర్యటన విఫలం'
'సీఎం రాయదుర్గం పర్యటన విఫలం'
Written By news on Saturday, May 19, 2012 | 5/19/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment