వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సాయంత్రం 4గంటలకు సమావేశం కానున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో చర్చలు జరపనున్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ సీట్లు, ఓట్ల రాజకీయంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్ర విభజనకు సంబంధించి తన వైఖరేంటో ఇంతవరకు ప్రకటించకుండా సమస్యను మరింత గందరగోళంలోకి నెట్టి కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశంలా కాకుండా, ఇదేదో కాంగ్రెస్ సొంత భవిష్యత్తుకు సంబంధించిన విషయమన్నట్టుగా రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లోనూ, అటు ఢిల్లీలోనూ ఆ పార్టీ ఒక వికృత క్రీడకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
రాష్ట్ర విభజనకు సంబంధించి తన వైఖరేంటో ఇంతవరకు ప్రకటించకుండా సమస్యను మరింత గందరగోళంలోకి నెట్టి కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశంలా కాకుండా, ఇదేదో కాంగ్రెస్ సొంత భవిష్యత్తుకు సంబంధించిన విషయమన్నట్టుగా రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లోనూ, అటు ఢిల్లీలోనూ ఆ పార్టీ ఒక వికృత క్రీడకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
0 comments:
Post a Comment