వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 220వ రోజు(జిల్లాలో ఐదో రోజు) కార్యక్రమ వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు బుధవారం ప్రకటించారు. గురువారం ఉదయం వైకుంఠపురానికి సమీపంలోని బస నుంచి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర.. మండాది, అక్కులపేట, తాళ్లవలస, తిమ్మాపురం, లకు్ష్మడిపేటల మీదుగా బొడ్డేపల్లిపేట చేరుకుంటుంది. భోజన విరామం తర్వాత ఆమదాలవలస చేరుకుంటుంది. అక్కడ రైల్వేస్టేషన్ వద్ద షర్మిల ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత ఊసవానిపేట, శొట్టవానిపేట వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం అక్కడికి సమీపంలో షర్మిల రాత్రి బస చేస్తారు.
జిల్లాలో ఐదో రోజు పర్యటించే ప్రాంతాలుమండాది, అక్కులపేట, తాళ్లవలస, తిమ్మాపురం, లకు్ష్మడిపేట, బొడ్డేపల్లిపేట, ఆమదాలవలస, ఊసవానిపేట, శొట్టవానిపేట. |
Home »
» మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా
Written By news on Thursday, July 25, 2013 | 7/25/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment