మౌలాలి ఘటనపై విజయమ్మ దిగ్భ్రాంతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మౌలాలి ఘటనపై విజయమ్మ దిగ్భ్రాంతి

మౌలాలి ఘటనపై విజయమ్మ దిగ్భ్రాంతి

Written By news on Tuesday, July 23, 2013 | 7/23/2013

రాష్ట్ర రాజధాని నగరంలోని మౌలాలిలో గోడ కూలిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె సంతాపం ప్రకటించారు. 

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పురాతన భవనాలు, పాతకట్టడాలపై చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగేది కాదని విజయమ్మ అన్నారు. సికింద్రాబాద్ లోని సిటీలైట్‌ హోటల్ ఘటనను మరువక ముందే ఈ ఘోరం జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు 
Share this article :

0 comments: