వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 219వ రోజు(జిల్లాలో నాలుగో రోజు) కార్యక్రమ వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు మంగళవారం ప్రకటించారు. బుధవారం ఉదయం పాలకొండ సమీపంలోని బస నుంచి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర.. తుడ్డలి, మర్రిపాడు, లక్కుపురం, పాలవలస, రామన్నపేట, కొండపేట, పెద్దపేట, మదనాపురం, బూర్జ అడ్డురోడ్డు మీదుగా అప్పలపేట చేరుకుంటుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం కురింపేట, సంకురాడ, కొల్లివలస, సింగన్నపాలెం, ఉప్పినవలస మీదుగా వైకుంఠపురం చేరుకుంటుంది. అనంతరం అక్కడికి సమీపంలో షర్మిల రాత్రి బస చేస్తారు.
జిల్లాలో నాలుగో రోజు పర్యటించే ప్రాంతాలు తుడ్డలి, మర్రిపాడు, లక్కుపురం, పాలవలస, రామన్నపేట, కొండపేట, పెద్దపేట, మదనాపురం, బూర్జ అడ్డురోడ్డు, అప్పలపేట, కురింపేట, సంకురాడ, కొల్లివలస, సింగన్నపాలెం, ఉప్పినవలస, వైకుంఠపురం. |
Home »
» మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా
Written By news on Wednesday, July 24, 2013 | 7/24/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment