పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో మీ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోండని కోరారు. నాలుగేళ్ల కిందటి వైఎస్ పాలనతో, ప్రస్తుత ప్రభుత్వ పాలన ఎలా ఉందో పోల్చుకోండని చెప్పారు.
రైతు బాగున్నప్పుడే పల్లె బాగుంటుందని ఆమె చెప్పారు. గతంలో చంద్రబాబు పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు తేడాలేదన్నారు. తన తొమ్మిదేళ్ల పాలనను మళ్లీ తెస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో ప్రజలపై కాంగ్రెస్ పార్టీ వేసినంత భారం గతంలో ఎన్నడూ లేదని చెప్పారు. అధికారంలోకి రాగానే వైఎస్ పాలనను జగన్ అందిస్తారని గర్వంగా చెబుతున్నామన్నారు. అలా చెప్పే ధైర్యం మిగతా పార్టీలకు ఎందుకు లేదో ఆలోచించంచాలన్నారు.
రాష్ట్ర భవిష్యత్ కోసం మీ ఓటును ఆయుధంగా మలుచుకోండని పిలుపు ఇచ్చారు. వైఎస్ సువర్ణయుగానికి పంచాయతీ ఓటు ద్వారా మీరే పునాదులు వేయాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులను వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా ఎన్నుకోండని విజ్ఞప్తి చేశారు. రాజన్నరాజ్యానికి మీరే బాటలు వేయాలని విజయమ్మ ఓటర్లను కోరారు.
రైతు బాగున్నప్పుడే పల్లె బాగుంటుందని ఆమె చెప్పారు. గతంలో చంద్రబాబు పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు తేడాలేదన్నారు. తన తొమ్మిదేళ్ల పాలనను మళ్లీ తెస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో ప్రజలపై కాంగ్రెస్ పార్టీ వేసినంత భారం గతంలో ఎన్నడూ లేదని చెప్పారు. అధికారంలోకి రాగానే వైఎస్ పాలనను జగన్ అందిస్తారని గర్వంగా చెబుతున్నామన్నారు. అలా చెప్పే ధైర్యం మిగతా పార్టీలకు ఎందుకు లేదో ఆలోచించంచాలన్నారు.
రాష్ట్ర భవిష్యత్ కోసం మీ ఓటును ఆయుధంగా మలుచుకోండని పిలుపు ఇచ్చారు. వైఎస్ సువర్ణయుగానికి పంచాయతీ ఓటు ద్వారా మీరే పునాదులు వేయాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులను వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా ఎన్నుకోండని విజ్ఞప్తి చేశారు. రాజన్నరాజ్యానికి మీరే బాటలు వేయాలని విజయమ్మ ఓటర్లను కోరారు.
0 comments:
Post a Comment