వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 224వ రోజు (జిల్లాలో 9వ రోజు) కార్యక్రమ వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు ఆదివారం ప్రకటించారు. సోమవారం ఉదయం ధర్మలక్ష్మీపురానికి సమీపంలోని బస నుంచి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర నౌతల మీదుగా ధనుపురం చేరుకుంటుంది. అక్కడ ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం కమలమ్మకొట్టు చేరుకుంటారు. భోజన విరామం తర్వాత కొరసవాడ, బూరగాం గ్రామాల మీదుగా పాతపట్నం చేరుకుంటారు. అనంతరం అక్కడికి సమీపంలో రాత్రి బస చేస్తారు.
జిల్లాలో 9వ రోజు పర్యటించే ప్రాంతాలు
నౌతల, ధనుపురం, కమలమ్మకొట్టు,
కొరసవాడ, బూరగాం, పాతపట్నం
జిల్లాలో 9వ రోజు పర్యటించే ప్రాంతాలు
నౌతల, ధనుపురం, కమలమ్మకొట్టు,
కొరసవాడ, బూరగాం, పాతపట్నం
0 comments:
Post a Comment