రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ శోభారాణి శుక్రవారం హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో ఉన్న తన ఇంట్లో స్వచ్చంధ గృహ నిర్భంధం విధించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిరంజీవిని రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. చిరంజీవి సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోను నటుడే అని ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్.. రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని చూస్తోందని ఆమె ధ్వజమెత్తారు. సోనియా గాంధీ దేశం విడిచి వెళ్లాలని ఆమె డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమేనని శోభారాణి ప్రకటించారు. గతంలో కూడా శోభారాణి గృహ నిర్భంధం విధించుకుని హడావుడి చేశారు. తెలంగాణ వాదులు ఆమె ఇంటిపై దాడి చేసిన సంగతి తెలిసిందే.
0 comments:
Post a Comment