చిరంజీవిని రాళ్లతో కొట్టాలి: శోభారాణి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చిరంజీవిని రాళ్లతో కొట్టాలి: శోభారాణి

చిరంజీవిని రాళ్లతో కొట్టాలి: శోభారాణి

Written By news on Friday, August 2, 2013 | 8/02/2013

చిరంజీవిని రాళ్లతో కొట్టాలి: శోభారాణి
హైదరాబాద్ : కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి కుటుంబసభ్యులు నటించిన సినిమాలను అడ్డుకుంటామని మాజీ పీఆర్పీ నాయకురాలు శోభారాణి హెచ్చరించారు. పైసల కోసం చిరంజీవి పార్టీని అమ్ముకున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్ర విభజనపై నోరెత్తని చిరంజీవి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ శోభారాణి శుక్రవారం హైదరాబాదులోని శ్రీనగర్‌ కాలనీలో ఉన్న తన ఇంట్లో స్వచ్చంధ గృహ నిర్భంధం విధించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిరంజీవిని రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. చిరంజీవి సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోను నటుడే అని ధ్వజమెత్తారు.

రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్.. రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని చూస్తోందని ఆమె ధ్వజమెత్తారు. సోనియా గాంధీ దేశం విడిచి వెళ్లాలని ఆమె డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమేనని శోభారాణి ప్రకటించారు. గతంలో కూడా శోభారాణి గృహ నిర్భంధం విధించుకుని హడావుడి చేశారు. తెలంగాణ వాదులు ఆమె ఇంటిపై దాడి చేసిన సంగతి తెలిసిందే.
Share this article :

0 comments: