ఆనాడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు నేడు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించి ఆ నిందను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వేయటానికి ప్రయత్నిస్తున్నారని ఆయన శుక్రవారమిక్కడ విమర్శించారు. వైఎస్ఆర్ సమైక్యవాదో...కాదో ఒక్కసారి అసెంబ్లీ రికార్డులు తిరగేస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి....సోనియాగాంధీ కాళ్లు మొక్కి తిరిగి వచ్చారని ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఎద్దేవా చేశారు.
మరోవైపు విజభనను నిరసిస్తూ వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్లలో ఓ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేయగా, తోటి విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా పులివెందులలో మహిళలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యవాదులు తహసీల్దారు కార్యాయం ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగారు. రాజంపేటలోనూ రాజకీయ వర్గాలు ర్యాలీ చేపట్టాయి. నేడు కూడా దుకాణాలు స్వచ్చందంగా మూతపడ్డాయి.
మరోవైపు విజభనను నిరసిస్తూ వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్లలో ఓ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేయగా, తోటి విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా పులివెందులలో మహిళలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యవాదులు తహసీల్దారు కార్యాయం ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగారు. రాజంపేటలోనూ రాజకీయ వర్గాలు ర్యాలీ చేపట్టాయి. నేడు కూడా దుకాణాలు స్వచ్చందంగా మూతపడ్డాయి.
0 comments:
Post a Comment