వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 229వ రోజు (జిల్లాలో 14వ రోజు) కార్యక్రమ వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తల శిల రఘురాం, వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు శుక్రవారం ప్రకటించారు. శనివారం ఉదయం బూరగాం సమీపంలోని బస నుంచి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర.. జలంత్రకోట జంక్షన్, కంచిలి, బైరిపురం గ్రామాల మీదుగా సాగుతుంది. భోజన విరామం తర్వాత షర్మిల.. సంత, జాడుపూడి, గొర్లెపాడు, ఆర్.కరాపాడు, కవిటి జంక్షన్ల మీదుగా గుడ్డిభద్ర గ్రామం చేరుకుంటారు. అనంతరం అక్కడ రాత్రి బస చేస్తారు.
జిల్లాలో 14వ రోజు పర్యటించే ప్రాంతాలు
జలంత్రకోట జంక్షన్, కంచిలి, బైరిపురం, సంత, జాడుపూడి, గొర్లెపాడు, ఆర్.కరాపాడు, కవిటి జంక్షన్, గుడ్డిభద్ర
0 comments:
Post a Comment