హైదరాబాద్: వైఎస్ఆర్ సిపి నాయకురాలు షర్మిల మరోప్రజా ప్రస్థానం పాదయాత్ర ఓ అపూర్వ చారిత్రక ఘట్టం అని ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. షర్మిల పాదయాత్ర ప్రపంచ రాజకీయ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదగిన ఘట్టం అని పేర్కొన్నారు. దాదాపు మూడున్నర కోట్ల మంది తెలుగు ప్రజలను పలకరిస్తూ సాగిన పాదయాత్ర రేపటితో ముగియబోతుందని చెప్పారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నిశాచరుడుగా రాత్రిళ్లు అవహేళన పాదయాత్ర చేశారన్నారు. భారతదేశంలోనే ఏ మహిళా 3113 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రికార్డు లేదని తెలిపారు. కోట్లాది మంది తెలుగు ప్రజల ఆత్మీయ అనుబంధాల మధ్య సాగిన పాదయాత్ర ప్రజల్లో ఒక బరోసా, నమ్మకాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నిశాచరుడుగా రాత్రిళ్లు అవహేళన పాదయాత్ర చేశారన్నారు. భారతదేశంలోనే ఏ మహిళా 3113 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రికార్డు లేదని తెలిపారు. కోట్లాది మంది తెలుగు ప్రజల ఆత్మీయ అనుబంధాల మధ్య సాగిన పాదయాత్ర ప్రజల్లో ఒక బరోసా, నమ్మకాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
0 comments:
Post a Comment