మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు ఆదివారం ఒక రోజు విరామం ప్రకటించారు. శివరాత్రి నేపథ్యంలో గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాచుర్యం పొందిన కోటప్పకొండ తిరునాళ్లు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఆ ప్రాంత పరిసరాల్లో భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తారు.
దీంతో ప్రజలు, పార్టీ కార్యకర్తల కోరిక మేరకు, జిల్లా పోలీసు యంత్రాంగం సూచనల మేరకు పాదయాత్రను ఒకరోజు నిలిపి వేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, గుంటూరు జిల్లా పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ ప్రకటించారు. శనివారం రాత్రి పాదయాత్ర ముగిశాక చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గణపవరం గ్రామశివార్లలో షర్మిల బస చేస్తారు. ఆదివారం రోజంతా ఆమె అక్కడే ఉంటారని, సోమవారం 11వ తేదీ ఉదయం మళ్లీ అక్కడి నుంచే పాదయాత్రను ప్రారంభిస్తారని వారు వివరించారు.
దీంతో ప్రజలు, పార్టీ కార్యకర్తల కోరిక మేరకు, జిల్లా పోలీసు యంత్రాంగం సూచనల మేరకు పాదయాత్రను ఒకరోజు నిలిపి వేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, గుంటూరు జిల్లా పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ ప్రకటించారు. శనివారం రాత్రి పాదయాత్ర ముగిశాక చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గణపవరం గ్రామశివార్లలో షర్మిల బస చేస్తారు. ఆదివారం రోజంతా ఆమె అక్కడే ఉంటారని, సోమవారం 11వ తేదీ ఉదయం మళ్లీ అక్కడి నుంచే పాదయాత్రను ప్రారంభిస్తారని వారు వివరించారు.
0 comments:
Post a Comment