Home »
» అప్పటి దేవుడు.. ఇప్పుడు ద్రోహి అయ్యాడా
అప్పటి దేవుడు.. ఇప్పుడు ద్రోహి అయ్యాడా
పదవులిచ్చి, గౌరవం ఇచ్చినపుడు వైఎస్ రాజశేఖరరెడ్డిని దేవుడని పొగిడారు... ఆయన మరణించాక దళితద్రోహి అంటున్నారు... ఇదేమైనా పద్ధతిగా ఉందా? అని జూపూడి ప్రభాకరరావు తిరుపతిలో ప్రశ్నించారు. వైఎస్సార్ వల్లనే తమకు పదవులు వచ్చాయన్న విషయం మరచి మాట్లాడుతున్నారని విమర్శించారు. పాదయాత్ర ద్వారా రెండుసార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఆ మహానేతపై ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. శ్రీకాకుళం ఓదార్పు యాత్రలో రూట్మ్యాప్తో సహా అన్నీ దగ్గరుండి చూసుకున్న మంత్రి మురళి ఇప్పుడు జగన్ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో 18 వేల కిలోమీటర్లు ఓదార్పుయాత్ర చేసిన జగన్మోహన్రెడ్డిని కులాలు, మతాలకు అతీతంగా ప్రజలు అభిమానిస్తున్నారని తెలిపారు. ఎవరు మంచి చేసినా దళితులు మరచిపోరని, మంచి చేసిన వారిపట్ల జీవితాంతం విశ్వాసంగా ఉంటారన్న మంచిపేరు ఉందని, దీన్ని చెడగొట్టవద్దని ఆయన కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలు విషయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసిన సంగతిని గుర్తు చేశారు. శాసనమండలిలో తాను పట్టుబట్టి చర్చకు అవకాశం కల్పించినందుకే ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ సాధ్యమైందన్నారు. |
|
0 comments:
Post a Comment