సంగారెడ్డి రూరల్, న్యూస్లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మజీద్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత ఘర్షణల వల్ల నష్టపోయిన వారిని పరామర్శించేందుకు సంగారెడ్డికి వచ్చిన ఆయన అల్లరి మూకల దాడిలో ధ్వంసమైన మానియా మజీద్ను సందర్శించారు. ఈ సందర్భంగా మజీద్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మజీద్ పేషిమామ్ అబ్దుల్ మజీద్తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు.
కొందరు రాజకీయ నాయకులు పథకం ప్రకారం అల్లర్లు సృష్టించి హిందూ-ముస్లింల మధ్య దూరాన్ని పెంచుతున్నారని విమర్శించారు. అల్లర్ల కారణంగా ఎందరో పేదలు నష్టపోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ,ముస్లింలు సోదరభావంతో మెలిగి విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. అల్లర్ల కారణంగా ఆస్తి నష్టపోయిన తమ పిల్లలనే అరెస్టు చేస్తూ పోలీసులు వేధిస్తున్నారని బాధితులు కొందరు జగన్కు వివరించారు. ఈ విషయమై ప్రభుత్వంతో పోరాడి అందరికి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీనిచ్చారు.
కొందరు రాజకీయ నాయకులు పథకం ప్రకారం అల్లర్లు సృష్టించి హిందూ-ముస్లింల మధ్య దూరాన్ని పెంచుతున్నారని విమర్శించారు. అల్లర్ల కారణంగా ఎందరో పేదలు నష్టపోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ,ముస్లింలు సోదరభావంతో మెలిగి విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. అల్లర్ల కారణంగా ఆస్తి నష్టపోయిన తమ పిల్లలనే అరెస్టు చేస్తూ పోలీసులు వేధిస్తున్నారని బాధితులు కొందరు జగన్కు వివరించారు. ఈ విషయమై ప్రభుత్వంతో పోరాడి అందరికి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీనిచ్చారు.
0 comments:
Post a Comment