టిడిపి పని అయిపోయిందని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఈ రోజు సాక్షి న్యూస్ మేకర్ చర్చలో విజయవాడ నుంచి ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా వార్తలను ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నేత వల్లభనేని వంశీకి ఆ పార్టీ షోకాజ్ నోటీస్ ఇవ్వడాన్ని తప్పు పట్టారు. 2004లో తాను చంద్రబాబును కలిశానని తనకి ఎవరూ షోకాజులివ్వలేదని చెప్పారు.
విశ్వసనీయతే కొలమానంగా తాను జగన్ పార్టీలో చేరానని చెప్పారు. అభిమానులు తన నిర్ణయాన్ని సమర్థించారని తెలిపారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నాన్న మరణాన్ని ఓట్లుగా మలుచుకుందని, ఆ తర్వాత కొందరు నాయకులు తనని తొక్కే ప్రయత్నం చేశారని చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ కష్టకాలంలో తనకు అండగా నిలిచారని చెప్పారు. ఆయన వద్దంటున్నా కొందరి నాయకుల తీరు వల్ల ఆ నాడు కాంగ్రెస్ పార్టీ మారినట్లు చెప్పారు. పీఆర్పీలో చేరిన తర్వాత తాను ఎప్పుడూ వైఎస్ ని పల్లెత్తుమాటనలేదని తెలిపారు. వైఎస్ వల్ల పెద్దవారయిన వారు ఇప్పుడు ఆయన్నే తప్పుబడుతున్నారని బాధపడ్డారు. వీటన్నింటిని
ప్రజలు గమనిస్తున్నారన్నారు. వంగవీటి మోహన రంగాను అభిమానించే ప్రతి అభిమాని జగన్ వెంటే ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ లో ఉంటే భవిష్యత్తు లేదన్నారు.
వైఎస్ కులమతాలకు అతీతంగా పాలించారు. జగన్ కు కులాలను ఆపాదించడం చెత్త రాజకీయం అన్నారు. చిరంజీవి అమాయకుడని, ఆయనకు రాజకీయం తెలియదని చెప్పారు. కొందరు ఆయన్ను తప్పుదారి పట్టించారన్నారు. తన సామాజికవర్గంలో తనని విమర్శించేవారు ఉన్నారని తెలిపారు.
సైకిల్ షాపులో పనిచేసే రంగా అంత నేత అయ్యారంటే ప్రజలు ఆయన్ను నమ్మారు. తన తండ్రిగాని, వైఎస్ గాని వెన్నుపోటు పొడిచి పెద్దవారు కాలేదన్నారు. జగన్ న్ని ప్రజల నమ్మకమే నడిపిస్తోందని చెప్పారు.
విశ్వసనీయతే కొలమానంగా తాను జగన్ పార్టీలో చేరానని చెప్పారు. అభిమానులు తన నిర్ణయాన్ని సమర్థించారని తెలిపారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నాన్న మరణాన్ని ఓట్లుగా మలుచుకుందని, ఆ తర్వాత కొందరు నాయకులు తనని తొక్కే ప్రయత్నం చేశారని చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ కష్టకాలంలో తనకు అండగా నిలిచారని చెప్పారు. ఆయన వద్దంటున్నా కొందరి నాయకుల తీరు వల్ల ఆ నాడు కాంగ్రెస్ పార్టీ మారినట్లు చెప్పారు. పీఆర్పీలో చేరిన తర్వాత తాను ఎప్పుడూ వైఎస్ ని పల్లెత్తుమాటనలేదని తెలిపారు. వైఎస్ వల్ల పెద్దవారయిన వారు ఇప్పుడు ఆయన్నే తప్పుబడుతున్నారని బాధపడ్డారు. వీటన్నింటిని
ప్రజలు గమనిస్తున్నారన్నారు. వంగవీటి మోహన రంగాను అభిమానించే ప్రతి అభిమాని జగన్ వెంటే ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ లో ఉంటే భవిష్యత్తు లేదన్నారు.
వైఎస్ కులమతాలకు అతీతంగా పాలించారు. జగన్ కు కులాలను ఆపాదించడం చెత్త రాజకీయం అన్నారు. చిరంజీవి అమాయకుడని, ఆయనకు రాజకీయం తెలియదని చెప్పారు. కొందరు ఆయన్ను తప్పుదారి పట్టించారన్నారు. తన సామాజికవర్గంలో తనని విమర్శించేవారు ఉన్నారని తెలిపారు.
సైకిల్ షాపులో పనిచేసే రంగా అంత నేత అయ్యారంటే ప్రజలు ఆయన్ను నమ్మారు. తన తండ్రిగాని, వైఎస్ గాని వెన్నుపోటు పొడిచి పెద్దవారు కాలేదన్నారు. జగన్ న్ని ప్రజల నమ్మకమే నడిపిస్తోందని చెప్పారు.
0 comments:
Post a Comment