ప్రతి ఓటు రైతన్నకే: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రతి ఓటు రైతన్నకే: జగన్

ప్రతి ఓటు రైతన్నకే: జగన్

Written By news on Wednesday, May 23, 2012 | 5/23/2012

 మీరు వేసే ప్రతి ఓటు రైతన్న, పేదవాడికి దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఓటర్లకు తెలిపారు. ఈరోజు దుర్గిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. జగన్ బహిరంగ సభకు ప్రజలు పోటెత్తారు. అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పదవి త్యాగం చేసిన ఎమ్మెల్యేలకు మీ ఆశీస్సులు అందజేయండని కోరారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేస్తున్న అన్యాయాలకు జూన్ 12న సమాధానం చెప్పాలని జగన్ పిలుపు ఇచ్చారు.

ఉపాధి కల్పనే లక్ష్యంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ పారిశ్రామిక వేత్తలకు భూములు కేటాయించారని తెలిపారు. వైఎస్ఆర్ భూకేటాయింపుల్లో సీబీఐ తప్పులు వెతుకుతోందన్నారు. ఉద్యోగాలిస్తే భూములు ఉచితంగా ఇస్తామని గుజరాత్, తమిళనాడు ముఖ్యమంత్రులు చెబుతున్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విషయానికొచ్చేసరికి సీబీఐ వేరే విధంగా వ్యవహరించిందని చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డున ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థకు చంద్రబాబు 532 ఎకరాలు ధారాదత్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఫ్యాక్టరీలు పెట్టడానికి, భారీగా ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ భూములు ఇవ్వలేదని, గోల్ఫ్ ఆడుకోవడానికి ఇచ్చిన భూములపై సీబీఐ కన్నెత్తికూడ చూడటంలేదని తెలిపారు.
Share this article :

0 comments: