వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి సంబంధించి జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు విజ్ఞప్తి చేశారు. ఈ సాయంత్రం సిబిఐ కార్యాలయం బయట ఆయన విలేకరులతో మాట్లాడారు. బయట అనుకునేటంతటి భయంకరమైన పరిస్థితి ఇక్కడ ఏమీలేదని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో విచారణ కొనసాగుతోందన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. జగన్ పేరుతో అల్లర్లు చేస్తే పార్టీకి, జగన్ కు సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని కోరారు.
ఈ నెల 28వ తేదీ సోమవారం జగన్మోహన రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరవుతారని చెప్పారు. అందువల్ల కోర్టు వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని, దానిపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు
ఈ నెల 28వ తేదీ సోమవారం జగన్మోహన రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరవుతారని చెప్పారు. అందువల్ల కోర్టు వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని, దానిపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు
0 comments:
Post a Comment