టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కనీస విలువలు పాటించకుండా వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై అవాస్తవాలను గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎం.మారెప్ప దుయ్యబట్టారు. ఆయన శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, వైఎస్ కుటుంబంపై చంద్రబాబు, ఆయన గ్యాంగ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, అదే తరహాలో తాము కూడా వారి కుటుంబ, వ్యక్తిగత విషయాలు మాట్లాడితే తలెత్తుకుని తిరగలేరని అన్నారు. బ్రదర్ అనిల్కుమార్ తన బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పినా, సిగ్గులేకుండా చంద్రబాబు తన అనుచరులతో దుష్ర్పచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు కొడుకు లోకేష్ చదువుకు సత్యం రామలింగరాజు రూ. 85 కోట్లు వెచ్చించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
రెండెకరాల పొలం నుంచి వచ్చిన చంద్రబాబుకు దేశవిదేశాల్లో వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో బహిరంగ చర్చకు సిద్ధపడాలని మారెప్ప సవాలు విసిరారు. చంద్రబాబు బతుకంతా హత్యా రాజకీయాలు, వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలేనని ధ్వజమెత్తారు. మామ ఎన్టీ రామారావును స్లో పాయిజన్ ద్వారా అంతం చేశారని ఆరోపించారు. ‘నిత్యం వైఎస్ కుటుంబాన్ని నిందించడం, ఆడిపోసుకోవడం తప్ప ప్రజల కోసం ఏనాడైనా ఒక్క మంచిపని చేశావా? తొమ్మిదేళ్లు ప్రతిపక్షనేతగా ఉంటూ ఏ రోజైనా ప్రజాసమస్యలపై ఆందోళన, ధర్నా లు చేశావా?’ అని చంద్రబాబును ప్రశ్నించారు. చెప్పుకోవటానికి ఏమీలేక నిత్యం వైఎస్ కుటుంబంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
చంద్రబాబు కొడుకు లోకేష్ చదువుకు సత్యం రామలింగరాజు రూ. 85 కోట్లు వెచ్చించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
రెండెకరాల పొలం నుంచి వచ్చిన చంద్రబాబుకు దేశవిదేశాల్లో వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో బహిరంగ చర్చకు సిద్ధపడాలని మారెప్ప సవాలు విసిరారు. చంద్రబాబు బతుకంతా హత్యా రాజకీయాలు, వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలేనని ధ్వజమెత్తారు. మామ ఎన్టీ రామారావును స్లో పాయిజన్ ద్వారా అంతం చేశారని ఆరోపించారు. ‘నిత్యం వైఎస్ కుటుంబాన్ని నిందించడం, ఆడిపోసుకోవడం తప్ప ప్రజల కోసం ఏనాడైనా ఒక్క మంచిపని చేశావా? తొమ్మిదేళ్లు ప్రతిపక్షనేతగా ఉంటూ ఏ రోజైనా ప్రజాసమస్యలపై ఆందోళన, ధర్నా లు చేశావా?’ అని చంద్రబాబును ప్రశ్నించారు. చెప్పుకోవటానికి ఏమీలేక నిత్యం వైఎస్ కుటుంబంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
0 comments:
Post a Comment