ఆపదలో అపరసంజీవని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆపదలో అపరసంజీవని

ఆపదలో అపరసంజీవని

Written By news on Tuesday, July 9, 2013 | 7/09/2013

నాడు: రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా.. ఎవరు ప్రాణాపాయంలో ఉన్నా.. గర్భిణికి నొప్పు లొచ్చినా.. ఒక్క ఫోన్ కొడితే చాలు కుయ్... కుయ్‌మంటూ నిమిషాల్లో వచ్చేది 108. బాధితులకు వాహనంలోనే ఆక్సిజన్ అందిస్తూ.. ప్రాథమిక చికిత్స చేస్తూనే ఆసుపత్రికి తరలించేది. ఆపదలో ఉన్న వారిని అపరసంజీవనిలా ఆదుకునేది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన ఈ పథకం.. ఆయన ఉన్నంత సేపూ అందరినీ ఇలాగే ఆదుకుంది.

నేడు: ఇప్పుడు ఆ అపర సంజీవనికే ఆపదవచ్చింది. వైఎస్సార్ మరణానంతరం సర్కారు 108ను పూర్తిగా గాలికి వదిలేసింది. నిధుల విడుదల తగ్గించేసింది. ఫలితంగా.. చెడిపోయిన వాహనాలు మరమ్మతులు లేక మూలనపడ్డాయి. ఉన్న వాహనాల్లోనూ కొన్ని డీజిల్ లేక నడవడం లేదు. 108లో ప్రధానమైన ఆక్సిజన్ సిలిండర్లను సైతం ప్రభుత్వం అరకొరగా సరఫరా చేస్తోందని సిబ్బందే చెబుతున్నారు. పిలిస్తే వెంటనే చేరుకునే ఈ అంబులెన్స్‌లు ఇప్పు డు ఉనికి కాపాడుకునే దుస్థితిలో పడ్డాయనడానికి కరీంనగర్ జిల్లాలోని ఈ రెండు దృష్టాంతాలు చాలు.. 
- సాక్షి, కరీంనగర్

108 రాలేదు.. ప్రాణం పోయింది
‘‘నా పేరు జంగ సరోజన. మాది తిమ్మాపూర్ మండ లం రేణికుంట గ్రామం. నాకు ఒక కుమారుడు రవీందర్‌రెడ్డి, ఇద్దరు కూతుళ్లు. మాది పేద కుటుంబం. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. నా భర్త ఆదిరెడ్డి మే నెల 28న హుజు రాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి కరీంనగర్‌కు చేరుకుని అక్కడ నుంచి బైక్‌పై తిరిగి రేణికుంటకు వస్తున్నాడు. ఎల్‌ఎండీలోని మహాత్మనగర్ వద్ద ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొట్టింది. కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు 108కు ఫోన్ చేసినా 45 నిమిషాల వరకు రాలేదు. కాపాడాలని కనబడిన వారినందరినీ నా భర్త వేడుకున్నాడు. ఎవరూ స్పందించలేదు. అక్కడున్న వారు 108 వస్తుం దని వేచి చూశారు. ఎంతకీ రాకపోవడంతో బంధువులు కారు తీసుకుని వచ్చి ఆసు పత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే చనిపోయాడు. మా ఇంటి దీపం ఆరిపోయింది. నేను నా పెద్ద దిక్కును కోల్పోయాను. 108 వస్తుందని ఎదురు చూస్తూ ఎవరూ వాహన సాయం చేయలేదు. ఆలస్యం కావడంతో నా భర్త ప్రాణాలు పోయాయి’’. 

- జంగ సరోజన..రేణికుంట

ప్రభుత్వమే.. నాన్నను హత్య చేసింది..
‘‘మా నాన్నకు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు 108కు ఫోన్ చేసినా సకాలంలో స్పందించలేదట. నాకు తెలిసిన వెంటనే నేను వేగంగా అక్కడికి బయ ల్దేరాను. అప్పటికే మా బంధువులు కారులో తీసుకెళ్తుండగా మధ్యలో చనిపోయినట్లు చెప్పారు. 108 టైమ్‌కి వచ్చి ఉంటే నా తండ్రికి ఆక్సిజన్ అందేది. ఆసుపత్రికి త్వరగా వెళితే చికిత్స అందేది. ఆయన బతికేవాడు. కుటుంబ సభ్యులం వెళ్లి మాట్లాడే వాళ్లం. కానీ కనీసం మాటకు కూడా నోచుకోకుండానే దూరమయ్యాడు. 108 వచ్చి ఉంటే ఆయన బతికేవాడని అందరూ అంటుంటే.. ఆ రోజు చాలా బాధనిపించింది. నిజానికి మా నాన్నది ప్రభుత్వం చేసిన హత్యే. అత్యవసర సేవలైన 108, ఆరోగ్యశ్రీలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వెఎస్సార్ ఉన్నపుడు వీటికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. 
- జంగ రవీందర్‌రెడ్డి

నాడు.. పది నిమిషాల్లో వచ్చింది.. 
‘‘నా పేరు దాసారపు మోహన్.. మాది గోదావరిఖని. 2007 జూన్ 13న రాత్రి నాకు ఒక్కసారిగా చెమటలు పట్టాయి. ఒకవైపు జోరుగా వర్షం కురుస్తుంటే చెమటలు రావడమేంటని కంగారు మొదలైంది. ఛాతిలో నొప్పి కూడా మొదలైంది. సింగరేణి ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే నా భార్య పల్స్ చూసి వెంటనే ఆసుపత్రికి వెళ్దామంది. వెంటనే 108కు ఫోన్ చేసింది. పది నిమిషాల్లో వాహనం ఇంటి ముందు ఆగింది. వెంటనే సిబ్బంది నాకు ఆక్సిజన్ అందిస్తూనే నాలిక కింద ఓ మాత్ర పెట్టి ప్రథమ చిక్సిత చేశారు. 

తర్వాత సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ప్రథమ చికిత్స అందడం, వెంటనే ఆసుపత్రికి రావడం వల్ల ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. అప్పుడనిపించింది.. 108 అంబులెన్స్ మినీ డిస్పెన్సరీ అని. నా ప్రాణాలు కాపాడిన 108పై నమ్మకం పెరిగింది. 108 సర్వీసులకు అప్పటి ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం బాగా నచ్చింది. అందుకే 108కు వాలంటరీగా సేవలందిస్తున్నాను.

నేడు.. ఫోన్ చేస్తే స్పందనే లేదు.. 
108 సహాయం వల్ల పునర్జన్మ పొందిన నాకు ఇప్పుడు ఆ సర్వీస్‌లపై నమ్మకం పోయింది. రెండేళ్ల క్రితం నేను ఓసారి హైదరాబాద్ వెళ్తుంటే ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై కనిపించాడు. వెంటనే 108కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసిన నాథుడు లేడు. విసుగేసింది. అలాగే గోదావరిఖని కూరగాయాల మార్కెట్ దగ్గర ఓ వ్యక్తి గాయాలతో పడిపోయి ఉంటే 108కు ఫోన్ చేశా.. ఎవరూ లిఫ్ట్ చేయలేదు. దీంతో నాకు తెలిసిన ఇక్కడి 108 అంబులెన్స్ డ్రైవర్‌కు ఫోన్ చేసి వీలైన సాయం చేశాను. ప్రభుత్వ ప్రోత్సహం లేకపోడంతో 108 సేవలు ఇలా దెబ్బతింటున్నాయి.’’
- దాసారపు మోహన్, గోదావరిఖని
Share this article :

0 comments: