హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. వ్యక్తిగత హాజరునుంచి మినహాయించాలనే జగన్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మే 25 తేదిన హాజరుకావాల్సిందేనని జగన్ ను కోర్టు ఆదేశించింది. సీఆర్ పీసీ 41(1)ఏ ప్రకారం వ్యవహరించాలని సీబీఐకి ఆదేశాలను హైకోర్టు జారీ చేసింది. మే 28 తేదిన కోర్గుకు హాజరు సమన్లు ఉండగానే జగన్ ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ ఆతృత పడుతోంది. ఈ సంఘటనలను బట్టి సీబీఐ దురుద్దేశం స్పష్టంగా వెల్లడవుతోందని, రాజకీయ లబ్ది కోసమే అరెస్ట్ కు ప్రయత్నిస్తోందని జగన్ తరపు న్యాయవాది అభిప్రాయపడ్డారు. జగన్ వ్యవహారంలో సీబీఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని పలువురు విమర్శించారు.
Home »
» జగన్ లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కృతి
జగన్ లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కృతి
Written By news on Wednesday, May 23, 2012 | 5/23/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment