కాంగ్రెస్, టీడీపీ కోమాలోకి వెళ్లాల్సిందే: భూమా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్, టీడీపీ కోమాలోకి వెళ్లాల్సిందే: భూమా

కాంగ్రెస్, టీడీపీ కోమాలోకి వెళ్లాల్సిందే: భూమా

Written By news on Monday, March 4, 2013 | 3/04/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు కోమాలోకి వెళ్లిపోతాయని, 40 ఏళ్ల పాటు ఆ పార్టీలు కనిపించవని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాయలసీమ కో-ఆర్డినేటర్, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం జరిగిన వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశంలో భూమా మాట్లాడారు. ఎన్నికలెప్పుడు జరిగినా ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్,టీడీపీలను ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలను ఒకే పార్టీగానే ప్రజలు గుర్తించాలని కోరారు. సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నప్పుడు జగన్ ముఖ్యమంత్రి కావడం తప్పా అని ప్రశ్నించారు. ముస్లిం మైనారిటీలంతా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి అండగా ఉన్నారన్నారు.
Share this article :

0 comments: