టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాలనలోనే రాష్ట్రం లో కుడి ఎడమల దగా జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యు లు కేకే మహేందర్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కుడిఎడమ ప్రాంతా ల్లో పారుతున్న కృష్ణా, గోదావరి నదులపై పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు 1995లోనే ప్రాజెక్టులను నిర్మిస్తుంటే బాబు అడ్డుకోలేకపోయారన్నారు. కేంద్రంలో అప్పట్లో చక్రం తిప్పుతున్నానన్న బాబు, రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. 2004లో కేంద్రమంత్రిగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు, రాష్ట్ర మంత్రులుగా టీఆర్ఎస్ నేతలు బాబ్లీ విషయంలో ఎందుకు స్పందించలేకపోయారని మహేందర్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పవర్లెస్ సీఎం కిరణ్..వ్యవసాయ రంగానికి కరెంటివ్వకుండా పన్నులవాతలు పెడుతున్నారన్నారు.
Home »
» బాబు పాలనలోనే కుడి ఎడమల దగా
బాబు పాలనలోనే కుడి ఎడమల దగా
Written By news on Monday, March 4, 2013 | 3/04/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment