ఖమ్మం: దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు. చంద్రబాబు నాయకుడు కాదు ఖల్నాయక్ అన్నారు. త్వరలో జగనన్న బయటకు వచ్చి సీఎం అవుతారని, రాజన్నరాజ్యం తెస్తారని చెప్పారు. షర్మిల నేటి పాదయాత్ర శివాయిగూడెంలో ముగిసింది. అంతకుముందు శివాయిగూడెం సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు.
కాంగ్రెస్ కు బాబు సాయం: ద్వారంపూడి
కాకినాడ: వైఎస్ఆర్ జనం గుండెల్లో ఉన్నారన్న విషయం మరచి కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్ని వైఎస్ జగన్ను జైల్లో పెట్టించాయని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. తనపై కేసులు లేకుండా చూసుకునేందుకే రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచి అవిశ్వాస సమయంలో కాంగ్రెస్ చంద్రబాబు సాయపడ్డారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు కారణం చంద్రబాబే.. అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వాన్ని పడగొట్టి ఉంటే ఈనాడు ప్రజలకు విద్యుత్ కష్టాలు ఉండేవి కాదన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి సమక్షంలో డెయిరీ ఫాం సెంటర్కు చెందిన 500 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు.
- See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=587925&Categoryid=14&subcatid=0#sthash.XeFSxXhS.dpuf
0 comments:
Post a Comment