ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజా క్షేత్రంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా శనివారం ఆమె రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు చేవెళ్లలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరిగి నియోజకవర్గం చిట్టెంపల్లిలో రచ్చబండ నిర్వహించి, సాయంత్రం నాలుగు గంటలకు వికారాబాద్ లో బహిరంగ సభలో విజయమ్మ పాల్గొంటారని రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్థన్ రెడ్డి తెలిపారు.
Home »
» రంగారెడ్డి జిల్లాలో రేపు విజయమ్మ పర్యటన
రంగారెడ్డి జిల్లాలో రేపు విజయమ్మ పర్యటన
Written By news on Friday, April 26, 2013 | 4/26/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment