డీజీపీ దినేష్రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. మహిళలపై లైంగిక వేధింపుల్లో రాష్ట్రం ప్రథమస్థానంలో ఉందని, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్లు పెరిగిపోతున్నాయని డీజీపీకి రాసిన లేఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో 70 శాతం మంది మహిళలేనని, ఇప్పటికైనా మహిళలపై అఘాయిత్యాలు ఆపేలా చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ విజ్క్షప్తి చేసింది.
ప్రతి పట్టణంలో మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటుచేయాలని, పోలీస్ రిక్రూట్మెంట్లో 25 శాతం మహిళలను నియమించాలని డీజీపీకి రాసిన లేఖలో వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేసింది. మహిళలపై దాడులను ఆరికట్టడానికి రాష్ట్ర మహిళా కమిషన్ను పునరుద్ధరించాలని, ప్రసార మాధ్యమాల్లో అశ్లీలతను అరికట్టాలని, ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డీజీపీకి వైఎస్ఆర్ సీపీ లేఖలో సూచించింది.
ప్రతి పట్టణంలో మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటుచేయాలని, పోలీస్ రిక్రూట్మెంట్లో 25 శాతం మహిళలను నియమించాలని డీజీపీకి రాసిన లేఖలో వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేసింది. మహిళలపై దాడులను ఆరికట్టడానికి రాష్ట్ర మహిళా కమిషన్ను పునరుద్ధరించాలని, ప్రసార మాధ్యమాల్లో అశ్లీలతను అరికట్టాలని, ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డీజీపీకి వైఎస్ఆర్ సీపీ లేఖలో సూచించింది.
0 comments:
Post a Comment