బయ్యారంపై నాపై అసత్య ఆరోపణలు: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బయ్యారంపై నాపై అసత్య ఆరోపణలు: షర్మిల

బయ్యారంపై నాపై అసత్య ఆరోపణలు: షర్మిల

Written By news on Monday, April 22, 2013 | 4/22/2013

 బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మహానేత వైఎస్‌ఆర్ ఎప్పుడో ప్రతిపాదించారని షర్మిల అన్నారు. బయ్యారం ఉక్కు విశాఖకు తరలిస్తే తెలంగాణ గిరిజనులకు అన్యాయమేనని షర్మిల తెలిపారు. కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌లు తన పై అసత్య ప్రచారం చేస్తున్నాయని షర్మిల అన్నారు. రక్షణ స్టీల్‌లో తనకు వాటా ఉన్నట్లు నిరూపిస్తే వెంటనే పాదయాత్ర ఆపేస్తానని..నిరూపించక పోతే చంద్రబాబు పార్టీకీ రాజీనామా చేస్తారా అని షర్మిల ప్రశ్నించారు.

తాను చేస్తున్న సవాల్‌ను ఎవరైనా స్వీకరించ వచ్చని షర్మిల అన్నారు. దళిత బాంధవున్ని చెప్పుకుంటున్న కిరణ్‌...దళితులకు ఏం చేశారో చెప్పాలని షర్మిల నిలదీశారు. వైఎస్ తన హయాంలో దళితులకు 20 లక్షల ఎకరాల భూమిని పంపిణి చేశారని, 18 లక్షల దళిత కుటుంబాలకు 1200కోట్ల రుణాలు మాఫీ చేశారని తెలిపారు.

వైఎస్‌ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, కిరణ్‌ హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు ఇబ్బంది పడుతుంటే కిరణ్‌ రైతు చైతన్య యాత్ర చేస్తున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. సీఎం కిరణ్‌ రైతు చైతన్య యాత్రల పేరుతో మోసం చేసేందుకు యత్నిస్తున్నారని, చైతన్య యాత్రల పేరుతో గ్రామాల్లోకి వెళ్తే కాంగ్రెస్‌ నేతలను ప్రజలు రాళ్లతో కొడతారని షర్మిల ధ్వజమెత్తారు. 
Share this article :

0 comments: