గవర్నర్ నివేదికపై బాబు నోరుమెదపరే: పద్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గవర్నర్ నివేదికపై బాబు నోరుమెదపరే: పద్మ

గవర్నర్ నివేదికపై బాబు నోరుమెదపరే: పద్మ

Written By news on Friday, April 27, 2012 | 4/27/2012


రాష్ట్రంలో పాలన లేదన్న గవర్నర్ నివేదికపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నోరుమెదపరేం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రజాసమస్యలు పట్టవా? అని అడిగారు. ప్రభుత్వానికి రైతుల పట్ల కనీసం దయకూడా లేదన్నారు. రాష్ట్రంలో దాదాపు 600 ఫైళ్లు పెండింగ్లో ఉన్నట్లు గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసిందన్నారు. ఉపఎన్నికల తర్వాత రాష్ట్రపతి పాలనే గత్యంతరమని కూడా గవర్నర్ తన నివేదికలో తెలిపినట్లు ఆమె చెప్పారు. 

ప్రభుత్వాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచకపాలనలో చంద్రబాబుకు భాగస్వామ్యం ఉందా? అని కూడా ఆమె అడిగారు.


Share this article :

0 comments: