పోలవరం: రాష్ట్రంలో పేదల బాధలను పట్టించుకునేవారే లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆయన తూర్పువేములదీవిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మరణం తర్వాత కూడా గుర్తిండిపోయేలా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సముద్రతీరప్రాంతాలను కలుషితం చేసే ఫ్యాక్టరీలను అడ్డుకుంటామని చెప్పారు. అన్ని చర్యలు తీసుకున్న తర్వాతే అనుమతి ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలు మత్స్యకారులకే వచ్చేలా చూస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే నర్సాపురం సమీపంలో హార్బర్ నిర్మాణం చేపడతామని చెప్పారు. ఉచితంగా ఉన్నత చదువులు చదివిస్తానని హామీ ఇస్తున్నానని, ఈ హామీని ఛాలెంజ్ గా స్వీకరిస్తామన్నారు.
పల్లంలో అగ్నిప్రమాదం జరిగి సర్వం కోల్పోయిన మత్స్యకారులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు గానీ పరామర్శించలేదన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని బాధపడ్డారు. ఆరోగ్యశ్రీ జాబితా నుంచి 130కిపైగా రోగాలను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రసన్నం చేసుకుంటే చాలు అన్నరీతిలో ఇక్కడ పాలన సాగుతోందని విమర్శించారు.
పల్లంలో అగ్నిప్రమాదం జరిగి సర్వం కోల్పోయిన మత్స్యకారులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు గానీ పరామర్శించలేదన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని బాధపడ్డారు. ఆరోగ్యశ్రీ జాబితా నుంచి 130కిపైగా రోగాలను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రసన్నం చేసుకుంటే చాలు అన్నరీతిలో ఇక్కడ పాలన సాగుతోందని విమర్శించారు.
0 comments:
Post a Comment