నేడు భీమవరం, విజయవాడలో జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు భీమవరం, విజయవాడలో జగన్ పర్యటన

నేడు భీమవరం, విజయవాడలో జగన్ పర్యటన

Written By news on Friday, April 27, 2012 | 4/27/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, కృష్ణా జిల్లా విజయవాడలో జరిగే సభల్లో పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. ఉదయం పాలకొల్లు నుంచి భీమవరం వెళ్లి, అక్కడ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గం గుండా హనుమాన్ జంక్షన్ చేరుకుని అక్కడ దివంగత నేత రాజశేఖరరెడ్డి పేరు మీద నెలకొల్పిన ఉచిత కల్యాణ మండపాన్ని సందర్శిస్తారు. అక్కడ్నుంచి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆహ్వానం మేరకు విజయవాడ వెళ్తారు. రామవరప్పాడు నుంచి విజయవాడలోని రంగా విగ్రహం వరకు జగన్‌ను రాధాకృష్ణ భారీ ర్యాలీతో తీసుకువెళ్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొంటారు. ఈ సభలో జగన్ సమక్షంలో రాధాకృష్ణ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు. రాత్రికి జగన్ హైదరాబాద్ వెళతారు.
Share this article :

0 comments: