రాజమండ్రి, న్యూస్లైన్ :రామచంద్రపురం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనను ముగించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం రాత్రి 9.52 గంటలకు రాజమండ్రి నుంచి గౌతమీ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఆయనకు వీడ్కోలు పలకడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో రైల్వేస్టేషన్ కిక్కిరిసిపోయింది. జగన్ను చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని ప్రయాణికుల్లో పలువురు పోటీ పడ్డారు.
మాజీ మంత్రి బోస్, పార్టీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, కేంద్ర పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, నగర కన్వీనర్ బొమ్మన రాజ్కుమార్, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ మేయర్ ఎం.ఎస్.చక్రవర్తి, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు చోడిశెట్టి రాఘవబాబు.
వాణిజ్య విభాగం ఛైర్మన్ కర్రి పాపారాయుడు, కాకినాడ నగర క న్వీనర్ ప్రూటీ కుమార్, పార్టీ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, టి.కె.విశ్వేశ్వరరెడ్డి, మిండగుదిటి మోహన్, మోకా ఆనందసాగర్, కొండేటి చిట్టిబాబు, జక్కంపూడి రాజా, గుర్రం గౌతమ్, లంక సత్యనారాయణ, రావిపాటి రామచంద్రరావు, నక్కా రాజబాబు, పడాల రామారెడ్డి, ఇమామ్, ఆర్వీవీ సత్యనారాయణ చౌదరి, జక్కంపూడి గణేష్, పోతుల పద్దయ్య, రౌతు వెంకటేశ్వరరావు, వసుంధర, కానుబోయిన సాగర్, శెట్టిబత్తుల రాజబాబు, తాడి విజయభాస్కర్రెడ్డి, కామిశెట్టి విష్ణు జగన్కు వీడ్కోలు పలికారు.
0 comments:
Post a Comment