టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల విమర్శించారు. దీనికి బదులు చిరంజీవిలాగా హాల్సేల్గా కాంగ్రెస్కు అమ్ముడుపోతే మంచిదని సలహా ఇచ్చారు. ఇప్పటి ప్రభుత్వం చంద్రబాబు పాలనను తలపిస్తుందన్నారు. దామరచెర్ల గ్రామంలో జరిగిన రచ్చబండలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు వ్యవసాయం దండగని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని గుర్తు చేశారు. 4వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్నారని
విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్ని జగనన్నను అన్యాయంగా జైలులో పెట్టించాయని బాధపడ్డారు. జగనన్న బయట ఉంటే వారికి భవిష్యత్ ఉండదని భయపడ్డారన్నారు. అవిశ్వాసం పెట్టే బలం టీడీపీకి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదన్నారు. కిరణ్ ప్రభుత్వం చంద్రబాబు పాలన పార్ట్ 2లా ఉందని పేర్కొన్నారు
విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్ని జగనన్నను అన్యాయంగా జైలులో పెట్టించాయని బాధపడ్డారు. జగనన్న బయట ఉంటే వారికి భవిష్యత్ ఉండదని భయపడ్డారన్నారు. అవిశ్వాసం పెట్టే బలం టీడీపీకి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదన్నారు. కిరణ్ ప్రభుత్వం చంద్రబాబు పాలన పార్ట్ 2లా ఉందని పేర్కొన్నారు
0 comments:
Post a Comment